Wednesday, 28 March 2012

కలగూర గంప ప్రభుత్వాలు

ప్రియమైన భారత పౌరులారా ,నా సోదరులారా ,మనం అర్హత మరచి,భాద్యత విడిచి,దేశాన్ని గాలికి వదలడం ఎంత వరకు సబబు ?దయచేసి ఆలోచించండి? మనం తల పని చేయకో లేక నిర్లిప్తత వహించి కనపడ్డ వాడి నల్ల నాయకుడిగా అంగీకరించి దృష్టికి ఆనిన పార్టీ నల్లా అనుగ్రహించి ఇప్పటి కలగూర గంప లాంటి ప్రభుత్వాలను ఎన్నుకొని దేశాన్ని ప్రపంచ దేశాల ముందు తల వంచుకోనేలాచేస్తున్నాం . ఇది భావ్యమా ? ఆలోచించండి, రకరకాల వ్యక్తులని,రకరకాల పార్టీలని నమ్మి కలగూర గంప లాంటి ప్రభుత్వాల చేతులలో దేశాన్ని వున్చేస్తున్నాం ,ఇది ఎంత వినాసకరమో,ఎంత దరిద్రమో మీరుగ్రహించడం లేదు,ఇపుడు కాంగ్రెస్ లాంటి పార్టీ మన్మోహన్ సింగు లాంటి నిజాయతి పరుడు,నిష్కలన్కితుడు ,మేధావి, విద్యావంతుడు,అయిన ఆయనను ప్రధానిగా చేసి కుడా తమ కు దన్నుగా నిలుస్తున్న పార్టీలు కోరే దుర్మార్గపు కోరికలతో అంతటి గొప్ప ప్రదానిని కూడా పనిచేయనీయకుండ ప్రతి పనికి అడ్డు తగులుతూ దెస అభివృద్ధి కి ఆటంకం కలిగిస్తూ ,ప్రపంచ దేశాల ముందు తలవంచుకోనేలా చేస్తున్నాయి ,దీనికంతటికీ కారణం మనమే , మనం బాగా ఆలోచించి కులం,మతం,ప్రాంతం ఈ భావనలకు అతీతంగా ఒకే ఒక పార్టీని కేంద్రం లో ఉండేలా ఎన్నుకోగాలిగితే అది కాంగ్రెస్,బి జే పి ,కమునిస్టులు ఎవరైనా కావచ్చు వారు కచ్చితంగా దేశాన్ని దిశా,నిర్దేశం ఉండేలా పరిపాలించ వచ్చు కాదంటారా? దయచేసి ఇకపై కేంద్రంలో ఒకే పార్టీ అధికారం ఉండేలా చర్యలు తీసుకొనేలా ఉద్యమిద్దాం,దేశాన్ని కాపాడుకుందాం, భావి తరాలను సుఖ సంతోశాలలో ఉంచ గల నాయకత్వాన్ని తయారు చేసుకుందాం.ఉపక్రమించండి ...........ఒకరు ఇద్దరి,ఇద్దరు నలుగురుగా,నలుగురు ఎనిమిది మందిగా ఇలా ప్రభంజనమై దెస నాయకత్వాన్ని దారికి తెచ్చుకొందాం....జైహింద్

No comments:

Post a Comment